కరోనా తగ్గుముఖం: తెలంగాణలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, మరణాలు
తెలంగాణలో కరోనా కేసులుక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులుక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది.గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు.
గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 16,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను ఈ ఏడాది మే 12 నుండి. ఈ నెల 19 వ తేదీ నుండి లాక్డౌన్ అమలు చేశారు. లాక్డౌన్ అమలు చేయడంతో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిందని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది.