Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కు షాక్ : సాగర్ బరిలో 400మంది అమరవీరుల కుటుంబ సభ్యులు..

తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుమారెడ్డి వాపోయారు. 

Telangana : Martyrs forum to file 400 nominations in Nagarjuna Sagar - bsb
Author
Hyderabad, First Published Mar 25, 2021, 2:30 PM IST

తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుమారెడ్డి వాపోయారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానంలో వందలాది మంది పసుపు రైతులు నామినేష్ వేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తేవడంలో ఎంపీ కవిత విఫలమయ్యారని, అందుకే తాము నామినేషన్ వేసినట్లు రైతులు తెలిపారు. ఆ పసుపు రైతుల ఆందోళనల వల్లే ఎన్నికల్లో కవిత ఓటమిపాలయ్యారు. 

ఇప్పుడు తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యలు అదే వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగర్ ఉప ఎన్నికల్లో 400మంది అమరవీరు కుటుంబసభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 
అమరవీరుల ప్రాణ త్యాగాలా వల్లే తెలంగాణ వచ్చిందని, కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడుతోంది. కేసీఆర్ కు గుణపాఠం చెప్పేందుకే సాగర్ లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 1,385మంది అమరవీరుల కుటుంబాలను గుర్తించింది. కానీ ఇందులో 500 కుటుంబాలకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. మా కష్టాలను ప్రపంచానికి చెప్పేందుకు సాగర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. 400మంది అమరవీరుల కుటుంబ సభ్యులం నామినేషన్ వేయబోతున్నాం.. అని తెలంగాణ అమరవీరుల ఫోరం అధ్యక్షుడు రఘుమరెడ్డి తెలిపారు. 

అంతేకాదు 400 కంటే ఎక్కువ నామినేషన్లే వేద్దామనుకున్నామని.. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల 400 మంది మాత్రమే నామినేషన్ వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇష్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అందలేదని రఘుుమారెడ్డి వాపోయారు. 

ఈ పోరాటంలో తాము వైఎస్ షర్మిల మద్ధతు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న షర్మిలను కలిసి తమ కష్టాలను చెప్పుకుంటామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాల పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన దళిత్ యాక్షన్ కమిటీ మద్దతు తెలుపుతోందని రఘుమారెడ్డి చెప్పారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలయ్యింది. బుధవారం నాటికి 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అభ్యర్థి వేటలో ఉన్నాయి. నామినేషన్ల గడువు తేదీ మార్చి 30 వరకు ఉంది. 

ఐతే మార్చి 27, 28,29 తేదీలను ఈసీ సెలవుగా ప్రకటించడంతో మార్చి 25, మార్చి 30 మాత్రమే నామినేషన్ల దాఖలు చేయడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

ఇక ఈ నెల 31వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. ఏప్రిల్ 3 నామినేషన్ల చివరితేదీ. ఏప్రిల్ 17న పోలింగ్. మే 2న ఐదు రాష్ట్రాల ఫలితాలతో పాటే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలనూ ప్రకటిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios