శిథిలావస్థకు ఉస్మానియా ఆసుపత్రి: తెలంగాణ సర్కార్పై హైకోర్టు మండిపాటు
ఉస్మానియా ఆసుపత్రిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఆసుపత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అన్న అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది
ఉస్మానియా ఆసుపత్రిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఆసుపత్రిని పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా అన్న అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇందుకు నాలుగు వారాలు గడువిచ్చింది. ఆ లోగా ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని సూచించింది ధర్మాసనం. వారసత్వ కట్టడాలు కూల్చవద్దన్న వాదనలను సైతం దృష్టిలో పెట్టుకోవాలని కోరింది.
ఐదేళ్లుగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఉస్మానియా ఆసుపత్రిని పునర్నిర్మించాలని అలాగే చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దంటూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు.