తెలంగాణలో  నలుగురు ఐఎఎస్ అధికారులను  బదిలీ  చేస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది. 

హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న లోకేష్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించారు.
ఎక్సైజ్ శాఖ సంచాలకుడిగా ముషారఫ్ అలీ ఫారూఖీ,రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred