Asianet News TeluguAsianet News Telugu

ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదు : కిషన్ రెడ్డి

ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనే తెలంగాణ రాలేదని.. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 

telangana formation day celebrations in golkonda, kishan reddy comments - bsb
Author
First Published Jun 2, 2023, 8:10 AM IST

హైదరాబాద్ :  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి ప్రారంభించారు. ఈ ఉత్సవాలను కేంద్ర సాంస్కృతిక శాఖ జరుపుతోంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఈ ఒక్క వ్యక్తి వల్ల రాలేదని అన్నారు.  

తెలంగాణ ఉద్యమ సమయంలో బిజెపి క్రియాశీలంగా పని చేసిందని చెప్పుకొచ్చారు. ఆ ఉద్యమ సమయంలో పార్లమెంటులో బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పోరాడారని గుర్తు చేశారు. ఏ ఒక్క వ్యక్తి వల్లనో, కుటుంబం వల్లనో తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టించడంలో బిజెపి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios