Asianet News TeluguAsianet News Telugu

Telangana Congress: ఏపీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్.. ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  విజయంతో జోరు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ తదుపరి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్‌లోని మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి . పొరుగు రాష్ట్రంలో బ్యాచ్‌ల వారీగా సీనియర్ మంత్రులు, అనుభవజ్ఞులైన నాయకులను ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదు. 

Telangana Congress to campaign in Andhra Pradesh KRJ
Author
First Published Jan 27, 2024, 4:46 AM IST

Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది. ఈ ప్రభావం పొరుగు రాష్ట్రంపై కూడా పడింది.  ఏపీలో ఉనికి కోల్పోయిన పార్టీలో కూడా కొత్త ఆశలు చిగురించాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం వంటివి పార్టీని ఏపీలో బలోపేతం చేస్తాయని కాంగ్రెస్‌ భావిస్తున్నది.   ఈ పరిణామం గెలిచే స్థానాలతో సంబంధం లేకుండా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అయితే.. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త ప్లాన్ వేసింది.

తదుపరి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్‌లోని మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి . ఆంధ్రప్రదేశ్‌ లో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో  బ్యాచ్‌ల వారీగా తెలంగాణ సీనియర్ మంత్రులు, అనుభవజ్ఞులైన నాయకులతో ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ రావొచ్చన్న నేపథ్యంలో ఆ పార్టీ ముందస్తు ప్రచారానికి దిగేందుకు సిద్ధమైంది.   

ఇది ప్రారంభ దశలో ఉందని, అనేక అంశాలను ఖరారు చేసేందుకు చాలా సమన్వయ సమావేశాలు నిర్వహించాల్సి ఉందని తెలంగాణ మంత్రి ఒకరు తెలిపారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని విషయం గుర్తుండే ఉంటుంది . కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వైఎస్‌ షర్మిల ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ, కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉవ్విళ్లూరుతోంది. లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణ భారతదేశంలో తన సంఖ్యను పెంచుకోవడానికి పార్టీ ఆసక్తిగా ఉంది.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.. వారి ప్రచారం కూడా కొత్తవరకు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి ప్రచారం చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నరట.

నోటిఫికేషన్‌ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కాకుండా ఏపీ ఎన్నికల్లో తెలంగాణ నేతల సేవలను వినియోగించుకోవాలని, వేర్వేరు దశల్లో వస్తే పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నది. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెనర్‌గా నియమించి.. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయించాలని రాహుల్ పార్టీ భావిస్తున్నది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్‌లో రేవంత్‌రెడ్డితో ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.


త్వరలో ఏపీకి మంత్రి కొండా సురేఖ

ఈ తరుణంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేసింది.  త్వరలో ఏపీలో పర్యటిస్తాననీ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తో కొన్ని అంశాలపై చర్చించేందుకు  వస్తానని కొండా సురేఖ తెలిపారు . రాష్ట్రం నుండి దర్శనం కోసం తిరుమలకు వచ్చే నాయకులు , ఇతరులకు దర్శన సౌకర్యాలు ,  ప్రోటోకాల్‌లు వంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇచ్చే లేఖలను టీటీడీ అధికారులు గౌరవించడం లేదని పలువురు అన్నారు . తెలంగాణ భక్తుల సౌకర్యార్థం ఈ అంశాలన్నింటినీ క్రమబద్ధీకరించేందుకు చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, టీటీడీకి మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ఆమె దృష్టి పెట్టినట్టు తెలిసింది.

‘ఎట్‌హోమ్‌’కు గవర్నర్‌ ఆతిథ్యం

శుక్రవారం ఇక్కడి రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల సీనియర్‌ నాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితికి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్సీలు తప్ప.. చాలా మంది ఎమ్మెల్యేలు, నాయకులు కార్యక్రమంలో పాల్గొనలేదు. అలాగే, చాలా మంది సీనియర్ బిజెపి నాయకులు హాజరుకాకపోవడం కార్యక్రమంలో పాల్గొన్నవారి మధ్య చర్చలకు దారితీసింది.

Follow Us:
Download App:
  • android
  • ios