కోవిడ్ మెడిసిన్స్పై నిఘా.. కేటీఆర్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్
వ్యాక్సిన్లు, మందుల సరఫరాలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీటీలో అక్రమాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యాక్సిన్లు, మందుల సరఫరాలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వీటీలో అక్రమాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం ఏర్పాటయ్యే ఈ రాష్ట్ర స్థాయి టాస్క్ఫోర్స్కి మంత్రి కేటీఆర్ నేతృత్వం వహిస్తారు. ఈ టాస్క్ఫోర్స్లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ సహా పలువురు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు.
Also Read:తెలంగాణలో లాక్ డౌన్: వీటికి మినహాయింపులు, పెళ్లిళ్లూ అంత్యక్రియలపై ఆంక్షలు
కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి నిమిత్తం పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మే 12వ తేదీ నుంచి 22 వరకూ ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. లాక్డౌన్ విధించడంతో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపమని ఆర్టీసీ ప్రకటించింది. వ్యవసాయ రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఈ నెల 20 కేబినెట్ మరోసారి సమావేశమై లాక్డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది.