సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఏపీ బీఆర్ఎస్కు అధ్యక్షుడిని ప్రకటించేశారని, మరి తెలంగాణకు.. జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రా బిర్యానీని పేడ బిర్యానీని అని తిట్టలేదా అని సంజయ్ నిలదీశారు.
బీఆర్ఎస్తో మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదన్నారు. బీఆర్ఎస్కు తెలంగాణలో అధ్యక్షుడు లేడు కానీ ఏపీకి ప్రకటించారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఏపీ నేతల్ని పిలిపించుకుని కేసీఆర్ జాయిన్ చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్లను తీసుకొచ్చేందుకు వందకు పైగా కార్లను పంపించారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చాడని.. తర్వాత ఆంధ్రా వాళ్లను తిట్టాడని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రా బిర్యానీని పేడ బిర్యానీని అని తిట్టలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రైవేటీకరణపై మాట్లాడుతున్న కేసీఆర్.. ఆర్టీసీని ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఆయన నిలదీశారు. విద్యుత్ ఛార్జీలను పెంచారని.. పోలవరంపై కేసీఆర్ స్టాండ్ ఏంటని సంజయ్ ప్రశ్నించారు.
కాగా.. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించారు. ఏపీ లో రానున్న రోజుల్లో భారీగా పార్టీలో చేరికలు ఉంటాయని కేసీఆర్ చెప్పారు. ఎందరో కీలక నేతలు కూడా తనకు ఫోన్లు చేస్తున్నారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు, సంక్రాంతి తర్వాత ఏపీ నుండి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని కేసీఆర్ ప్రకటించారు. హైద్రాబాద్ కార్యాలయం కంటే ఏపీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున చేరుతారని కేసీఆర్ చెప్పారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కాన్షీరామ్ తో కలిసి పనిచేశారని, లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగితో కూడా ఆయన పనిచేశారన్నారు. రావెల కిసోరో బాబుతో తాను ఐదు గంటల పాటు చర్చించినట్టుగా కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రావెల కిషోర్ బాబు పనిచేయాల్సిన అవసరం ఉందని.. రావెల కిషోర్ బాబుకు ఢిల్లీ కేంద్రంగా పనిచేసే బాధ్యతలను అప్పగిస్తానని కేసీఆర్ ప్రకటించారు.
Also REad: బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, రావెలకు ఢిల్లీలో కీలక బాధ్యతలు: కేసీఆర్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తే తాము విశాఖ ఉక్కును తిరిగి జాతీయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎల్ఐసీని కేంద్రం ప్రైవేటీకరించినా తాము ఎల్ఐసీని వెనక్కు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా విద్యుత్ను అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు దళితబంధును కూడా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మత చిచ్చును పెడుతున్నారని బీజేపీ పై కేసీఆర్ మండిపడ్డారు.మేకిన్ ఇండియా వల్ల ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరిలో చైనా బజార్లు ఎలా వచ్చాయని కేసీఆర్ ప్రశ్నించారు. మన దేశంలోని దేవుడి ఫోటోలతో పాటు పతంగుల మంజా, భారత జాతీయ పతాకాలను కూడా చైనా నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు.
