Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్న కేసులో రోజుకో ట్విస్ట్.. తెరపైకి మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ !

ఆదివారం మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను మీద పోలీసులు గత నెల 27 న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Teenmar Mallanna : hyderabad police investigating amberpet shankar
Author
Hyderabad, First Published Sep 6, 2021, 9:39 AM IST

హైదరాబాద్ : మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ పేరు సుదీర్ఘ కాలం తరువాత తెరపైకి వచ్చింది. క్యూ న్యూస్ ఛానల్ వ్యస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మీద చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అంబర్ పేట్ శంకర్ పేరు బయటకు వచ్చింది. 

దీంతో ఆదివారం మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను మీద పోలీసులు గత నెల 27 న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీ కాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు శర్మకు మధ్య సెటిల్ మెంట్ చేయడానికి అంబర్ పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టాడు. 

దీంతో ఆదివారం శంకర్ ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శకర్మ కోరిన మీదట ఇరువురి మధ్యా రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని, అయితే తాను అందులో విపలమయ్యానని శంకర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. 

కాగా, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సికింద్రాబాదులోని చిలకలగుడా పోలీసులు గతనెల అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడనిపై మల్లన్నపై ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం చిలకలగుడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అప్పట్లో పోలీసులు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించారు. మరో కేసులో తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. తీన్మార్ మల్లన్నపై సైబర్ క్రైమ్ స్టేషన్ లో  రెండు కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లలో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. చిలకలగుడా కేసులోనే శుక్రవారం తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు .

చిలకలగుడాలో కేసు నమోదు: తీన్మార్ మల్లన్న అరెస్టు

ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన కేసులో తీన్మార్ మల్లన్నకు రెండు సార్లు నోటీసులు ఇచ్చి విచారించామని, ఇప్పుడు అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. తీన్మార్ మల్లన్న తనను బెదిరిస్తున్నాడని సికింద్రాబాదు మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన చిలకలగుడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎన్నో ఏళ్లుగా తాను జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్నానని, ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బందులు పెడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో చెప్పారు. తనకు రూ.30 లక్షలు ఇవ్వాలని తీన్మార్ మల్లన్న ఏప్రిల్ 19వ తేీదన తనకు వాట్సప్ కాల్ చేసి డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. 

డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తప్పుడు ప్రచారం చేయిస్తానని బెదిరించారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీన తన చానెల్ లో తప్పుడు వార్తను ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. దాంతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన తీన్మార్ మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios