టెక్కీ నీచం: కన్న బిడ్డల దుస్తులు విప్పి.. అసభ్యంగా తాకుతూ..
కన్న బిడ్డల విషయంలో చాలా కర్కశంగా ప్రవర్తించాడు. తన కన్న బిడ్డలపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అతను ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఉన్న వాడిలా నటించే ఆయన.. కన్న బిడ్డల విషయంలో చాలా కర్కశంగా ప్రవర్తించాడు. తన కన్న బిడ్డలపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల క్రితమే ఆయన ఈ లైంగిక దాడికి పాల్పడగా.. ఆ చిన్నారులను వారి తల్లి.. చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరకు పంపించడంతో.. అసలు విషయం తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ కి చెందిన నిందితుడు.. 2003 నుంచి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో స్థిరపడ్డాడు. ఇతనికి వెంకటగిరికి చెందిన మహిళతో వివాహమైంది. 2010 వరకు యూఎస్ లో ఉండి ఆ తర్వాత.. హైదరాబాద్ కి వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ లోనే నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
కాగా.. కొన్ని కారణాల వల్ల 2018లో భార్యభర్తలు విడిపోయి.. విడివిడిగా ఉంటున్నారు. అయితే.. తన ఇద్దరు పిల్లలు మానసికంగా కుంగిపోయి ఏదో ఇబ్బందిపడుతుంటే.. తల్లి.. వారికి ఇటీవల చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లింది. అయితే.. కౌన్సిలింగ్ లో పిల్లలు చెప్పిన మాటలు విని వైద్యులు కూడా షాకయ్యారు.
మూడేళ్ల క్రితం.. పిల్లలను తండ్రి, అతని స్నేహితులు దుస్తులు విప్పి.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. అసభ్యంగా ప్రవర్తించారని.. లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. వారు చెప్పిన దాని ప్రకారం.. తండ్రిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.