సెకండ్ వేవ్ డేంజర్, నాలుగు వారాలు కీలకం: తెలంగాణ హైల్త్ డైరెక్టర్
తెలంగాణలో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ డేంజర్ గా ఉందని ఆయన చెప్పారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని ఆయన చెప్పారు. ఈ నాలుగు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆసుపత్రుల్్లో బెడ్స్ కూడ దొరకకపోయే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కూడ సాధారణ వైద్య చికిత్సలతో పాటు కరోనా చికిత్సలు కూడ నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.