వికారాబాద్ జిల్లాలో వింతరోగం: వందలాది పక్షులు మృతి
వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వింత రోగం కలకలం సృష్టిస్తోంది. వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.జిల్లాలోని ధరూర్ మండలంలోని దోర్నాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వ్యాధి పక్కనే ఉన్న మరో మండలానికి పాకింది. ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదే గ్రామంలో జంతు కళేబరాలతో ఆయల్ తయారీ చేసే ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అనుమానిస్తున్నారు. వ్యాధికి గల కారణాలు ఏమిటనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
పెద్ద ఎత్తున పక్షులు మరణించడంతో స్థానికులు ఆందోళనగా ఉన్నారు. ఏ కారణం చేత పక్షులు మరణిస్తున్నాయో అంతు బట్టడం లేదంటున్నారు. పక్క మండలానికి కూడ వెంటనే ఈ వ్యాధి ప్రబలడంతో ఆ మండలానికి చెందిన ప్రజలు కూడ ఆందోళ చెందుతున్నారు.
స్థానికుల ఫిర్యాదుతో అధికారులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు చనిపోయిన పక్షుల కళేబరాలను పరీక్షించనున్నారు.