మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్లకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు రాష్ట్రపతి పోలీస్ పతకాలకు ఎంపికయ్యారు. రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ దేవేంద్ర సింగ్లు రాష్ట్రపతి నుంచి పతకాలను అందుకోనున్నారు. ఇకపోతే.. 215 మందికి పోలీస్ మెడల్ గ్యాలంటరీ (పీఎంజీ), 87 మందికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం), 648 మందికి విశిష్ట సేవ పోలీస్ మెడల్స్ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణ నుంచి 12 మంది అధికారులు ఇండియన్ పోలీస్ మెడల్స్కు ఎంపికయ్యారు. వీరందరికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.