Asianet News TeluguAsianet News Telugu

ఆ త్యాగాలపై మరొకరు సుఖపడుతున్నారు : కేసీఆర్ మీద ప్రవీణ్ కుమార్ పరోక్ష వ్యాఖ్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటకు వచ్చానని, తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొకరు సుఖ పడుతున్నారంటూ కేసీఆర్ మీద పరోక్షంగా చురకలు వేశారు. 

rs praveen kumar indirect comments on cm kcr over telangana martyrs - bsb
Author
Hyderabad, First Published Jul 28, 2021, 9:53 AM IST

సూర్యాపేట జిల్లా : సూర్యాపేట లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళన, సమావేశంలో రిటైర్డ్ ఐ పి యస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే బయటకు వచ్చానని, తెలంగాణా అమరుల త్యాగం మీద ఇంకొకరు సుఖ పడుతున్నారంటూ కేసీఆర్ మీద పరోక్షంగా చురకలు వేశారు. 

నేను చేసిన త్యాగానికి అర్ధం ఉండాలంటే బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి అని పిలుపునిచ్చారు.ఎవరినీ అడుక్కోవలసిన అవసరం లేకుండా మన రాజ్యాన్ని మనమే నిర్మించుకుందాం అన్నారు.

బహుజన అధికార నిధి కోసం అందరూ తమ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఆస్తులతో ప్రజలను వంచిస్తున్నారు, ఓట్లను కొని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

చారిత్రాత్మక నల్లగొండ జిల్లాలోనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. 
త్యాగాల పునాదుల మీదనే బహుజన రాజ్యం ఏర్పడుతుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios