Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల: తాళం వేసి వివాహానికి.. తిరిగొచ్చి చూస్తే అవాక్కు, పెళ్లికుమార్తె ఇంట్లో భారీ చోరీ

సిరిసిల్ల (siricilla) పట్టణంలో దోపిడి దొంగలు (robbery) బీభత్సం సృష్టించారు. స్థానిక నెహ్రూ నగర్‌లో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, 30 తులాల వెండి డైమండ్ రింగ్ తో పాటు 4 లక్షల 30 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. 

Robbery in bride home in rajanna siricilla district
Author
Sircilla, First Published Nov 10, 2021, 10:21 PM IST

సిరిసిల్ల (siricilla) పట్టణంలో దోపిడి దొంగలు (robbery) బీభత్సం సృష్టించారు. స్థానిక నెహ్రూ నగర్‌లో పెళ్లి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారం, 30 తులాల వెండి డైమండ్ రింగ్ తో పాటు 4 లక్షల 30 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. దూస సత్యనారాయణ కుమార్తె వివాహం స్థానిక భవాని ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. ఇదే అదునుగా భావించిన దొంగలు..  సత్యనారాయణ ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి మొత్తం ఊడ్చుకెళ్లారు. పెళ్లి అయిపోయాక ఇంటికి వ‌చ్చిన వ‌ధువు, ఆమె కుటుంబ స‌భ్యులు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని తెలిసి షాక‌య్యారు. వెంటనే పెళ్లి కుమార్తెతో పాటు కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జ‌రిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

"

Follow Us:
Download App:
  • android
  • ios