Asianet News TeluguAsianet News Telugu

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

అత్తాపూర్‌లో బుధవారం నాడు రమేష్ అనే వ్యక్తిని  నలుగురు  గొడ్డళ్లతో హత్య చేశారు.  తన కొడుకు మహేష్‌గౌడ్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రమేష్‌ను  మహేష్ తండ్రి హత్య చేశాడు

reason behind mahesh goud murder
Author
Hyderabad, First Published Sep 26, 2018, 3:03 PM IST


హైదరాబాద్: అత్తాపూర్‌లో బుధవారం నాడు రమేష్ అనే వ్యక్తిని  నలుగురు  గొడ్డళ్లతో హత్య చేశారు.  తన కొడుకు మహేష్‌గౌడ్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రమేష్‌ను  మహేష్ తండ్రి హత్య చేశాడు.అయితే మహేష్‌గౌడ్‌ను రమేష్ ఎందుకు హత్య చేశాడనే విషయం  కారు వాషింగ్ ద్వారా బయట పడింది.తన కొడుకును హత్య చేసినందుకుగాను మహేష్ తండ్రి రమేష్‌ను హత్య చేశాడు.

2017 డిసెంబర్ 24వ తేదీ రాత్రి మహేష్‌గౌడ్‌ను రమేష్ తన స్నేహితులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.  జుమ్మరాత్ బజార్‌కు చెందిన పురోహిత్   మహేష్‌గౌడ్‌  బేగంబజార్‌లోని ఓ కిరాణ దుకాణంలో పనిచేసేవాడు.

గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన మహేష్‌గౌడ్‌ను... రమేష్‌ మరికొందరు స్నేహితులతో కలిసి కడ్తాల్ మైసిగండికి తీసుకెళ్లాడు. కారులోనే మహేష్‌గౌడ్‌ను హత్య చేసిన రమేష్ అతని స్నేహితులు శవాన్ని పెట్రోల్ పోసి దగ్థం చేశారు. 

రమేష్, మహేష్‌లు ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు.  అయితే తాము నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన  వివాహితతో రమేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో  ఆమెతో మహేష్‌ కూడ చనువుగా ఉన్నాడు.  ఈ విషయమై మహేష్, రమేష్ మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో వివాహిత భర్తకు ఈ విషయం తెలిసి  అక్కడి నుండి  మరోచోటకు కాపురాన్ని మార్చాడు.

అయితే మహేష్‌పై కోపంగా ఉన్నా....కానీ రమేష్ మాత్రం కోపాన్ని అణచుకొన్నాడు. కానీ పైకి మాత్రం మహేష్‌తో స్నేహాన్ని నటించాడు. నమ్మించి మహేష్ ను తీసుకెళ్లిన రమేష్ కారులోనే హత్య చేశాడు.

అయితే కారులోనే మహేష్‌ను హత్య చేయడంతో రక్తం మరకలున్నాయి. అయితే కారును సర్వీసింగ్ ఇచ్చాడు రమేష్.అయితే సర్వీసింగ్ యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహేష్ గౌడ్ హత్య విషయం వెలుగు చూసింది.

ఈ కేసు విషయమై ఉప్పర్‌పల్లి కోర్టుకు  రమేష్ హాజరౌతున్నాడు. గత నెలలో కోర్టుకు హాజరైన  రమేష్ ఎక్కడి నుండి కోర్టుకు వస్తున్నాడు...ఎలా వెళ్తున్నాడనే విషయాన్ని మహేష్ తండ్రి రెక్కీ నిర్వహించాడు.  ఈ రెక్కీతో ఇవాళ కోర్టు నుండి వెళ్తున్న రమేష్‌ను మహేష్ తండ్రి అత్తాపూర్‌లోని పిల్లర్ 143 వద్ద గొడ్డలితో నరికి చంపాడు.

కొడుకును హత్య చేసిన రమేష్‌పై కక్షకట్టిన మహేష్ తండ్రి.. అదను కోసం ఎదురుచూసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత  నిందితులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
 

సంబంధిత వార్తలు

10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే

 

Follow Us:
Download App:
  • android
  • ios