Asianet News TeluguAsianet News Telugu

బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లే కేసీఆర్ మీద మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి సంజయ్ ,లోఫర్ ఎంపీ అరవింద్ అంటూ కామెంట్స్ చేశారు. దళిత బంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకం అన్నారు. హుజురాబాద్ లో కెసిఆర్ విస్పష్టంగా దళిత బంధు గురించి చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్ల రూపాయల నిస్తామని కెసిఆర్ చెప్పారు.

PUC Chairman, MLA A. Jeevan Reddy Press Meet in TRSLP Office in Hyderabad
Author
Hyderabad, First Published Aug 17, 2021, 12:42 PM IST

హైదరాబాద్ : ఈ రాష్ట్రం లో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరిల వాళ్ళున్నారు. వాళ్లే బ్రోకర్లు ,జోకర్లు ,లోఫర్లు అంటూ పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 

బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి సంజయ్ ,లోఫర్ ఎంపీ అరవింద్ అంటూ కామెంట్స్ చేశారు. దళిత బంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకం అన్నారు. హుజురాబాద్ లో కెసిఆర్ విస్పష్టంగా దళిత బంధు గురించి చెప్పారు. 17 లక్షల కుటుంబాలకు లక్షా 70 వేల కోట్ల రూపాయల నిస్తామని కెసిఆర్ చెప్పారు.
 
దళిత బంధు అమలైతే తమకు పుట్టగతులుండవని బ్రోకర్లు ,లోఫర్లు ,జోకర్లు కెసిఆర్ మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ అసాధ్యాన్ని సు సాధ్యం చేస్తారు. ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు. కెసిఆర్ ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలకు అనుమానమే. అయినా పథకాలు విజయవంతం అవుతున్నాయన్నారు. 
 
మా అందరికీ తల్లి లాంటి శోభమ్మ ను కూడా రాజకీయాల్లోకి రేవంత్ లాగడం శోచనీయం అని విరుచుకుపడ్డారు. దమ్ముంటే కాంగ్రెస్ ,బీజేపీ నేతలు తమ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు ను అమలు చేయాలని సవాల్ విసిరారు. కెసిఆర్ ఓ విజ్ఞాని ..రేవంత్ ఓ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. 
 
శకుంతల దేవి లెక్కల్లో హ్యూమన్ కంప్యూటర్ అయితే, పాలిటిక్స్ లో కెసిఆర్ హ్యూమన్ కంప్యూటర్ అన్నారు. కెసిఆర్ రాజనీతిఙ్ఞత ముందు వీరెంత ? దళిత బంధు తో రేవంత్ లాంటి నేతల చిన్న మెదడు చిప్ పాడైందన్నారు. తమ దుకాణాలు బంద్ అయితాయనే అక్కసు తో రేవంత్, బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు. 
 
దళిత బంధు తర్వాత కాంగ్రెస్ ,బీజేపీ కార్యాలయాలకు టు లెట్ బోర్డు తగిలించుకోవాల్సిందేనన్నారు. బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమం జోక్ అని కొట్టిపారేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అభాసు పాలైంది బండి సంజయ్ అన్నారు.

వరదల్లో దెబ్బ తిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని మాట తిప్పి బండి సంజయ్ జోకర్ పేరు తెచుకున్నాడన్నారు. మోడీ హామీల గురించి దరఖాస్తులు తీసుకో బండి సంజయ్ అంటూ చెప్పారు. 

నిజామాబాద్ ఎంపీ అరవింద్ మతపరంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, నిజామాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో అరవింద్ బట్టలు విప్పి ఊరేగించే రోజులు దగ్గర పడ్డాయన్నారు. హుజురాబాద్ లో సీఎం కెసిఆర్ రాజకీయాలు మాట్లాడలేదు. రేవంత్ ది మయోపిక్ మైండ్ అని.. మయోపిక్ అంటే దూరదృష్టి లేని వాడని అర్థం అని చెప్పుకొచ్చారు. 

గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్: రాజారావుతో సునీత లక్ష్మారెడ్డి భేటీ
 
రైతు బంధుకు నిధులున్నట్టే దళిత బంధుకు నిధులున్నాయని, హుజురాబాద్ లో గెలిచేది మేమే.. రేవంత్ కమీషన్ ఏజెంట్ అన్నారు. కాంగ్రెస్ కమీషన్ల పార్టీ అని దుయ్యబట్టారు. అవినీతి కి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బీజేపీ దర్వాజాలు తెరిచిందన్నారు. ప్రభుత్వ నుంచి వంద పైసలు ఇస్తే 16 పైసలు ప్రజలకు చేరడం లేదని ఆనాడు పీఎంగా ఉన్న రాజీవ్ గాంధే అన్నారని గుర్తు చేశారు.

ఆ సంస్కృతిని దూరం చేసి నేరుగా ప్రజల అకౌంట్లలోకే డబ్బులు వేస్తున్నారు సీఎం కెసిఆర్ అని చెప్పుకొచ్చారు. రేవంత్ చంద్రబాబు చప్రాసిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ను విమర్శించి వైఎస్ ది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనలేదా ? అలాంటి రేవంత్ కు ప్రాజెక్టుల గురించి ఇపుడు మాట్లాడే హక్కు ఉందా ? అని ప్రశ్నించారు. 

డెబ్బయేండ్ల శని ఏడేండ్లలో పోతుందా ? దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది.  కెసిఆర్ కౌటిల్యుడి లాంటి వారు. ఆర్థిక పరిస్థితి దృస్టిలో ఉంచుకునే పథకాలు రచిస్తాడు. రెండేళ్లలో దళిత బంధు దేశమంతా తెచ్చేలా కేంద్రం పై ఒత్తిడి పెరగడం ఖాయం అని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios