ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ‘పాలమూరు ప్రజా గర్జన’ సభకు పలువురు బీజేపీ సీనియర్, ముఖ్య నాయకులు డుమ్మా కొట్టారు. స్వయానా ప్రధాని వచ్చిన ఈ సభకు ఇక్కడి నాయకులు హాజరుకాకపోవడం దేనికి సంకేతమని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం బీజేపీ నిర్వహించిన ‘పాలమూరు ప్రజా గర్జన’ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. అయితే ఈ సభకు ఆ పార్టీలో ముఖ్య నేతలు హాజరుకాలేదు. తెలంగాణలోని పలువురు సీనియర్ లీడర్లు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. సభలో, 
 స్టేజీపైనా మాజీ ఎంపీలైన విజయశాంతి, వివేక్, అలాగే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కనిపించలేదు. అలాగే సిట్టింగ్ ఎంపీ సోయంబాపురావు కూడా ఈ సభకు హాజరుకాలేదు.

అనకాపల్లిలో అర్థరాత్రి ఉద్రిక్తత.. మాజీ మంత్రి బాండారు ఇంటి సమీపంలోకి భారీగా చేరుకున్న పోలీసులు

స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి, సభ నిర్వహించినా వీరంతా ఎందుకు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని విషయం ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. వీరంతా హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యతతో పాటు పదువులు ఇవ్వడం వల్ల వీరంతా అధిష్టానంపై అలకబూనిటనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్ర నుంచి పెద్ద నాయకులు వచ్చినా కలవకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే ప్రధాని సభకు హాజరుకాలేదని అర్థమవుతోంది.

Ujjain Rape| "ఆ చిన్నారికి నా చొక్కానే ఇచ్చా.." : కీలక విషయాలను వెల్లడించిన ఆటో డ్రైవర్‌

కాగా.. ఇటీవలే బీజేపీపై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి ఇట్లో భేటీ అయ్యారు. పార్టీ విషయంలో ఎదో ఒకటి తేల్చుకునే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఇందులో నాయకులు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణాల్లో రాజకీయ సమీకరణాల మార్పు, బీజేపీ హైకమాండ్ తీరుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 

భర్త ఆచూకీ చెప్పాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట మహిళ బైఠాయింపు.. అక్కడే ఆత్మహత్యాయత్నం..

బీఆర్ఎస్ పై బీజేపీ కఠిన వైఖరి అవలంభించకపోవడం వల్ల వీరంతా ‘రెండు పార్టీలు ఒక్కటే’ అని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుతోందని ఈ నాయకులంతా ఒక అభిప్రాయానికి వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే మరి కొన్ని రోజుల్లో ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

కాణిపాకం వినాయకుడి దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి..

అయితే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి, పాలమూరులో సభ నిర్వహించకముందే ఈ విషయంలో ఏదో ఒకటి తేలిపోతుందని ఈ అసంతృప్త నేతలందరూ భావించారు. కానీ అది ఇంత వరకు తేలలేదని అర్థమవుతోంది. అందుకే ఇక పార్టీతో తమకు, తమకు పార్టీతో అవసరం లేదని వారు అనుకుంటున్నారట. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతిలు తమ సొంత గూటికి వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే వారంతా ప్రధాని సభకు హాజరుకాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.