Asianet News TeluguAsianet News Telugu

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం... ప్రమాదంలో గర్భిణీ మృతి

ఇంటికి వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాగా... వారిలో భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

Pregnant woman Died in a Road Accident
Author
Hyderabad, First Published Feb 25, 2021, 8:46 AM IST

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణీ బలైంది. ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాగా... వారిలో భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. బుధవారం హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఘటన వివరాలిలా ఉన్నాయి. ముషీరాబాద్‌ కుమ్మరిబస్తీకి చెందిన సతీశ్‌గౌడ్, భార్య షాలిని దంపతులు కాగా, షాలిని రెండు నెలల గర్భిణి. 

ఉదయం భార్యాభర్తలిద్దరూ హైదర్‌గూడ ఫెర్నాండెజ్‌ ఆస్పత్రికి రెగ్యులర్‌ చెకప్‌ కోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా ...అదే సమయంలో ముషీరాబాద్‌ డిపోకు చెందిన ఏపీ28జెడ్‌0017 నంబర్‌ గల బస్సు కోఠి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తుంది.

హిమాయత్‌నగర్‌ వై జంక్షన్‌ వద్ద వేగంగా వస్తూ కుడివైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడ్డారు. బసు వెనుక భాగం చక్రాల్లో పడిపోయిన షాలినికి కాలి తొడ భాగం, ఛాతీ భాగాలు నుజ్జు అయ్యాయి. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లేశ్‌ ఓ అంబులెన్స్‌ సాయంతో హైదర్‌గూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..ఐసీయూలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా బస్సు నడిపిన మహబూబ్‌నగ్‌ జిల్లా ఫరీద్‌పూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ కమలన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios