Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నవీన్ రెడ్డి ప్లాన్: రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డితో పాటు  మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  వైశాలి కిడ్నాప్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. 
 

Police  Reveals key information In  Doctor Vaishali Kidnap Case
Author
First Published Dec 13, 2022, 4:39 PM IST

హైదరాబాద్: డాక్టర్ వైశాలి  కేసులో  నవీన్ రెడ్డితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.  నవీన్ రెడ్డి  కోసం పది పోలీస్ ప్రత్యేక బృందాలను  ఏర్పాటు  చేశారు. వైశాలి  కిడ్నాప్ కేసులో  ఇప్పటి కే 32 మందిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.  ఈ కేసుకు సంబంధించిన రిమాండ్  రిపోర్టులో  పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. 

గత ఏడాది బొంగులూరులోని స్పోర్ట్స్  అకాడమీలో వైశాలితో  నవీన్  రెడ్డికి పరిచయం ఏర్పడిందని పోలీసులు రిమాండ్  రిపోర్టులో  పేర్కొన్నారు. ఈ సమయంలో  వైశాలి  నెంబర్  తీసుకొని ఆమెకు తరచూ ఫోన్లు, మేసేజ్ లు  చేసేవాడని  పోలీసులు ఈ రిపోర్టు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత నవీన్ రెడ్డి  వైశాలి వద్ద పెళ్లి ప్రస్తావన  తీసుకు వచ్చాడు. అయితే  తన పేరేంట్స్  అడగాలని వైశాలి నవీన్ రెడ్డికి చెప్పిందని  రిమాండ్ రిపోర్టు తెలిపింది. వైశాలి  పేరేంట్స్ ను ఒప్పించేందుకు గాను నవీన్ రెడ్డి  ప్రయత్నించారు. కానీ  నవీన్ రెడ్డికి వైశాలిని ఇచ్చి పెళ్లి చేసేందుకు  అంగీకరించలేదు.

దీంతో  వైశాలి కుటుంబంపై  నవీన్ రెడ్డి కక్ష పెంచుకున్నారని  రిమాండ్  రిపోర్టు పేర్కొంది.  వైశాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్  ఖాతాను తెరిచి  డాక్టర్ వైశాలితో తాను  ఉన్న ఫోటోలను  వైరల్  చేశాడని పోలీసులు రిమాండ్  రిపోర్టు చెబుతుంది.ఐదు మాసాల క్రితం  వైశాలి ఇంటి ముందు స్థలాన్ని లీజుకు తీసుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా  నవీన్ రెడ్డి  అతని స్నేహితులు హంగామా చేశారు.ఈ విషయమై  వైశాలి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారని రిమాండ్ రిపోర్టు తెలుపుతుంది. 

ఈ నెల 9వ తేదీన   వైశాలికి  నిశ్చితార్ధం  ఉందని నవీన్ రెడ్డి  తెలుసుకున్నాడని రిమాండ్  రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వైశాలిని కిడ్నాప్ చేసి  పెళ్లి చేసుకోవాలని కుట్ర  పన్నారని  రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. తన అనుచరులు, మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని  డాక్టర్ వైశాలి కిడ్నాప్ కోసం ఉపయోగించుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో  తెలిపారు. వైశాలి ఇంటి ముందున్న ఐదు కార్లను కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసులు వివరించారు.  అంతేకాదు  వైశాలి నివాసంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారన్నారు.

also read:అచ్చు దృశ్యం సినిమానే: డాక్టర్ వైశాలి కిడ్నాప్‌నకు నవీన్ రెడ్డి పక్కా ప్లాన్

పోలీసులు తమ కోసం గాలింపు చర్యలు చేపట్టారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న నవీన్ రెడ్డి పారిపోయినట్టుగా  పోలీసులు తెలిపారు. నల్గొండలో  నవీన్ రెడ్డి అతని  స్నేహితులు  కారు దిగి పోయారని రిమాండ్ రిపోర్టు తెలిపింది.  రుమాన్ అనే యువకుడు  ఓ కారులో  వైశాలిని  హైద్రాబాద్ వైపునకు తీసుకు వచ్చినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో  32 మందిని అరెస్ట్  చేసినట్టుగా రిమాండ్ రిపోర్టు తెలిపింది.  ఈ కేసులో నవీన్ రెడ్డి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా  రిమాండ్ రిపోర్టు వివరించిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఈటీవీ కథనం ప్రసారం చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios