ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19న తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 19న తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ రైలును ప్రారంభించడంతో పాటుగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాచారం అందింది. మళ్లీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ఎప్పుడు వచ్చేదానిపై త్వరలోనే వివరాలు తెలియజేస్తామని పీఎంవో తెలియజేసింది.