రైలు బాత్రూమ్లో వేలాడుతున్న శవం.. పరిగెత్తిన ప్రయాణికులు
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి రైళ్లు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా మధురై-కాచిగూడ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు
ఆత్మహత్య చేసుకోవాలని అనుకునేవారికి రైళ్లు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి. తాజాగా మధురై-కాచిగూడ రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ వద్ద రైలులోని ఎస్-2 బోగిలో బాత్రూమ్కి వెళదామని కొందరు ప్రయాణికులు వచ్చారు.
అయితే వాష్రూమ్ తలుపు వేసి ఉండటంతో బయటి నుంచి చూశారు.. అందులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రయాణికులు టీటీకి సమాచారం అందించారు. రైలు కాచిగూడకు వచ్చిన తర్వాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తీసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు.
మృతదేహన్ని కిందకి దించి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని వద్ద టికెట్ లేకపోవడంతో ఏ స్టేషన్లో ఎక్కాడో.. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించడం కష్టంగా మారింది.