రంగారెడ్డి జిల్లాలో శిశు విక్రయం, అడ్డుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను విక్రయానికి పెట్టిందో జంట. ఎల్లమ్మ తండాకు చెందిన దంపతులు.. పోలీసులకు దొరికిపోయారు
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను విక్రయానికి పెట్టిందో జంట. ఎల్లమ్మ తండాకు చెందిన దంపతులు.. పోలీసులకు దొరికిపోయారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీను, సరిత దంపతులను విచారించగా... శిశువు విక్రయానికి సంబంధించిన బండారం బయటపడింది. కొనుగోలుదారులతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.