Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర మిమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి కొత్త డ్రామాకు ముఖ్యమంత్రి తెరలేపారని ఆరోపించారు.
Paddy procurement issue: ప్రస్తుతం తెలంగాణలో వరి ధాన్యం సేకరణ చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ.. ధాన్యం విషయంలో రాజకీయ కాక రేపుతున్నాయి. పోటాపోటీగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రయత్నిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.
కొత్త డ్రామాకు తెరలేపిన టీఆర్ఎస్ సర్కారు.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో ధర్నాకు దిగిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ రైతు ధర్నాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిరసన చేపట్టారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం న్యూఢిల్లీలో ధర్నా పేరుతో నాటకాలాడకుండా రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేసి కేంద్రానికి ముడిబియ్యం సరఫరా చేయాలని బండి సంజయ్ అన్నారు.
“మీరు నిజంగా రైతులను రక్షించాలనుకుంటే, రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం వరి పరిమాణాన్ని కొనుగోలు చేయండి. దానిని మిల్లింగ్ చేసి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ముడి బియ్యాన్ని సరఫరా చేయండి. మీరు సరఫరా చేసే ప్రతి బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. మీరు ఈ సవాలును స్వీకరిస్తారా? ” అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ బీజేపీ నేతలను కుక్కలు అని సంబోధించడాన్ని సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. "అతను తన మానసిక సమతుల్యతను కోల్పోయినట్లు అనిపిస్తుంది. నిజానికి టీఆర్ఎస్ నేతలే కుక్కల్లా మొరుగుతున్నారు. బీజేపీ కార్యకర్తలు కుక్కల్లా కాకుండా సింహంలా గర్జిస్తున్నారు. వారు మిమ్మల్ని మీ ఫామ్హౌస్లోని సౌకర్యవంతమైన సౌకర్యాల నుండి ధర్నా చౌక్కు మరియు అక్కడి నుండి న్యూఢిల్లీకి లాగారు” అని బండి సంజయ్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని అధికారం నుంచి దించుతానని కేసీఆర్ హెచ్చరించడంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజయ్ ఫైర్ అయ్యారు. "కేసీఆర్ నువ్వు ఆల్రెడీ ఫినిష్ అయిపోయావు. మిమ్మల్ని అధికారం నుంచి దించేందుకు తెలంగాణ ప్రజలు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో కేసీఆర్ లేరని" బీజేపీ అధ్యక్షుడు అన్నారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీలో ఈ డ్రామాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు.
రైతులకు అన్ని రకాల ప్రయోజనాలను అందించిన గొప్ప నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని సంజయ్ అన్నారు, “ప్రధాని మోడీ అధికారంలోకి రాకముందు వరి ఎమ్మార్పీ కేవలం రూ.1310 మాత్రమేనని, ఇప్పుడు క్వింటాల్కు రూ.1,960కి పెరిగిందన్నారు. . మార్కెట్లో పత్తి ధర క్వింటాల్కు రూ.4,000 మాత్రమే; 15,000కు పెరగలేదు. మిర్చి ధర క్వింటాల్ రూ.6 వేల నుంచి రూ.50 వేలకు పైగా చేరింది. ఆ ఘనత కేసీఆర్కు కాదు ప్రధాని మోడీకే దక్కుతుందని బండి సంజయ్ అన్నారు.
