ఒకరి భర్తతో.. మరొకరి భార్య పరార్..! పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఆ ఇద్దరు...!!
బంజారాహిల్స్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు ఎదురయ్యింది. ఓ భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ.. ఆ వ్యక్తి భార్యతో తన భర్త వెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బంజారాహిల్స్ పోలీసులకు ఓ విచిత్రమైన కేసు ఎదురయ్యింది. ఓ భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ.. ఆ వ్యక్తి భార్యతో తన భర్త వెళ్లాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇళా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాకు చెందిన బి. నారాయణదాస్, మోనికా దాస్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు.
యూసుఫ్ గూడ సమీపంలోని వెంకటగిరిలో నివాసముంటున్న నారాయణదాస్ ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. నిరుడు మోనికా దాస్ ఫోన్ లో ఎండీ ఆసిఫ్ అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతున్న విషయాన్ని గమనించిన భర్త నారాయణదాస్ మందలించాడు. ఈ విషయం మీద పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దు మణిగింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 24న భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా దాస్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కోల్ కతా వెళ్లిపోయింది. అక్కడ వాకబు చేయగా పిల్లలను తల్లి దగ్గర వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు వెంకటగిరిలో ఉంటున్న ఆసిఫ్ కూడా ఆమెతో పాటు వెళ్లినట్టు తెలిసింది.
ఇది తెలిసి షాక్ అయిన భర్త నారాయణదాస్ ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తన భర్త కనిపించడం లేదంటూ ఆసిఫ్ భార్య కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.