Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిల టూర్‌లో ట్విస్ట్: ఇంటికి తాళం వేసి వెళ్లిన నీలకంఠ ఫ్యామిలీ

సూర్యాపేట జిల్లాలో బుధవారం నాడు వైఎస్ షర్మిల  నీలకంఠ సాయి కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. షర్మిల మేడారం గ్రామానికి చేరుకొనే సమయానికి నీలకంఠ కుటుంబం ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయింది. 

neelakanta family disappear before Ys Sharmila reached medaram village lns
Author
Hyderabad, First Published Jun 16, 2021, 12:32 PM IST

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో బుధవారం నాడు వైఎస్ షర్మిల  నీలకంఠ సాయి కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమంలో ట్విస్ట్ చోటు చేసుకొంది. షర్మిల మేడారం గ్రామానికి చేరుకొనే సమయానికి నీలకంఠ కుటుంబం ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయింది. 

 తమ నేత షర్మిల పరామర్శించకుండా అడ్డుకొనేందుకు అధికార పార్టీ నేతలే నీలకంఠ కుటుంబాన్ని  కిడ్నాప్ చేశారని షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని నీలకంఠను పరామర్శించాలని షర్మిల నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ నీలకంఠ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆమె గతంలోనే ప్రకటించారు. 

also read:ఉద్రిక్తత... వైఎస్ షర్మిల కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

ఈ నిర్ణయం మేరకు ఆమె ఇవాళ హైద్రాబాద్ నుండి సూర్యాపేట జిల్లాలోని మేడారం గ్రామానికి వెళ్లారు. అయితే నీలకంఠ సాయి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. షర్మిల వస్తున్నారని తెలిసి టీఆర్ఎస్ నేతలు నీలకంఠ కుటుంబాన్ని తరలించారని షర్మిల అనుచరులు ఆరోపిస్తున్నారు.

తాళం వేసి ఉన్న నీలకంఠ ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.  నీలకంఠ కుటుంబాన్ని ఇక్కడి నుండి తరలించే బదులుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని షర్మిల పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే విషయమై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో నీలకంఠ గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కుటుంబాన్ని షర్మిల పరామర్శకు వెళ్లారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios