రామగుండం రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. రైలులోంచి దూకడంతో చిన్నారి, తల్లి మరణించగా.. మరో కుమారుడి పరిస్ధితి విషమంగా వుంది. 

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కదులుతున్న రైలులోంచి దూకి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. వీరిలో తల్లి, కుమారుడు (2) మరణించగా... మరో కుమారుడు (5) పరిస్ధితి విషమంగా వుంది. మృతురాలిని గోదావరిఖని యైటింక్లెయిన్ కాలనీకి చెందిన అరుణగా గుర్తించారు. వరకట్న వేధింపులతోనే అరుణ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred