కామారెడ్డిలో విషాదం : పిల్లల్ని వాగులో తోసేసి, తల్లి ఆత్మహత్యాయత్నం..!
కామారెడ్డిలో కుటుంబకలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని వాగులోకి తోసేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్యాయత్నం చేసింది.
కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను వాగులో తోసేసి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆ మహిళ అరుణ పిల్లలు అనోన్య, యువరాజ్ మరణించారు. అరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ కలహాలే ఆ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.