Asianet News TeluguAsianet News Telugu

బాలుడి హత్య : టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి, గ్రామంలో ఉద్రిక్తత, అరెస్ట్..

నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూరు లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... హాసాకొత్తూరు మారుతీ నగర్ లో నివాసముండే మాలవత్ శ్రీనివాస్, సరోజా దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు.

minor boy assassinated in, high tension in trs leader house at  nizamabad - bsb
Author
hyderabad, First Published May 21, 2021, 11:27 AM IST

నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూరు లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... హాసాకొత్తూరు మారుతీ నగర్ లో నివాసముండే మాలవత్ శ్రీనివాస్, సరోజా దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు.

ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ కదలలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. సరోజా వ్యవసాయ కూలీ, కాగా పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్ క్లీనర్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు.

ఇలా ఉండగా, బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్ వచ్చి మెదక్ వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో సిద్ధార్థ కు వరుసకు మామ అయిన వసంత్, అన్న కృష్ణ లకు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కనక రాజేష్ ఫోన్ చేశాడు.  సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని చెప్పాడు.

అంతేకాదు, అంత్యక్రియల నిమిత్తం గండి హనుమాన్ ప్రాంతానికి రమ్మని తెలిపాడు. దీంతో కృష్ణ, వసంత్ తోపాటు రవి, స్వామి అక్కడకు వెళ్లగా, ఎవరూ లేరు. మరోవైపు సిద్ధార్థ్ గురించి నరేందర్ అడిగితే రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థ కు ఫోన్ రాగా బయటకు వెళ్లాడు అని తెలిపాడు.

మరోవైపు గండి హనుమాన్ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ, అక్కడ లేకపోవడం, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీ గదిలో మృతదేహం తేలడం అంతా సినీ ఫక్కీలో జరిగిపోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు  తెలియగా, వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కనక రాజేష్ అతని అనుచరులు కలిసి పదిహేను రోజుల క్రితమే కృష్ణ, సిద్ధార్థను చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థను అతని అనుచరులు బాలా గౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ తదితరులు కలిసి చంపేశారని వాపోయారు.

తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు కాలనీవాసులు రాజేష్ ఇంటిని ముట్టడించారు. నిందితుడు ఇంటిపై దాడికి యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. గంటగంటకు పరిస్థితులు మారిపోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను దింపారు. ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలు మార్లు ఆందోళనకారులను చెదరగొట్టారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. ఇటు స్థానికులు, అటు పోలీసులు.. ఆరేడు వందల మందికి పైగా అక్కడ గుమిగూడారు.

సాయంత్రం వేళ నిజామాబాద్ డీసీపీలు స్వామి, శ్రీనివాస్, ర్మూర్‌ ఏసీపీ రఘు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

పరిస్థితులు అదుపులోకి వచ్చాక పోలీసులు రాత్రి 7గంటల సమయంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల సమక్షంలో భారీ బందోబస్తు  మధ్యే రాత్రి వేళ ఖననం చేశారు. మరోవైపు, మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios