Asianet News TeluguAsianet News Telugu

యాసంగి పంటలు: ఏవి బెటర్.. రేపు కేసీఆర్‌‌కు చేరనున్న నిపుణుల నివేదిక

యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్‌లో జరిగిన సమీక్ష‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం తుది నివేదిక అందజేస్తామన్నారు.  

minister niranjan reddy review on summer crops
Author
Hyderabad, First Published Sep 30, 2021, 10:30 PM IST

యాసంగి పంటల ప్రణాళికపై హాకా భవన్‌లో జరిగిన సమీక్ష‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభిృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వీసీ ప్రవీణ్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏఏ ప్రాంతాలలో ఏఏ పంటలు వేయాలన్న విషయం పై చర్చించామన్నారు.

వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు మంత్రి చెప్పారు. పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి ? మార్కెట్‌లో పంటల డిమాండ్ ఎలా ఉంది ? అన్నవిషయాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.స్థానిక, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ను బట్టి మార్కెటింగ్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ సూచనల పరిగణలోకి తీసుకోవాలని నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం తుది నివేదిక అందజేస్తామన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios