భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్
వీరులను స్మరించుకుందామంటున్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన నేడు.. ఆనాటి పోరాటంలో అసమాన త్యాగాలు చేసిన వీరులను స్మరించుకుందాం.. జై తెలంగాణ, జై హింద్ అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని నర్సింహారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Scroll to load tweet…
