కోలుకున్న అక్బరుద్దీన్..సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..?
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోలుకున్నారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను కంచన్బాగ్లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోలుకున్నారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను కంచన్బాగ్లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.
ఆయనకు ఆస్పత్రి మొదటి అంతస్తులోని ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త విని ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, బంధువులు హుటాహుటిన ఒవైసీ ఆసుపత్రికి చేరుకుని అక్బరుద్దీన్ను పరామర్శించి వెళ్లారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకోవడంతో.. ఒవైసీని ఆసుపత్రి నుంచి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఓవైసికి తీవ్ర అస్వస్థత...హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు