Asianet News TeluguAsianet News Telugu

అశ్లీల ఫోటోలతో మహిళా మేనేజర్‌‌పై వేధింపులు...అదే సంస్థ ఉద్యోగి నిర్వాకం

ఆమె ఆ కంపనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆమె వద్ద ఓ యువకుడు హెల్పర్ గా పనిచేసేవాడు. అయితే ఆ మహిళా ఉన్నతాధికారిపై కన్నేసిన యువకుడు రహస్య బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. ఆమె పోటోలను సేకరించి వాటిని మార్పింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు పంపించి తన కోరిక తీర్చకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే ఆ బెదిరింపులకు భయపడకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు.

Man blackmails women with morphed photos
Author
Hyderabad, First Published Sep 15, 2018, 4:32 PM IST

ఆమె ఆ కంపనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆమె వద్ద ఓ యువకుడు హెల్పర్ గా పనిచేసేవాడు. అయితే ఆ మహిళా ఉన్నతాధికారిపై కన్నేసిన యువకుడు రహస్య బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. ఆమె పోటోలను సేకరించి వాటిని మార్పింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. వాటిని ఆమెకు పంపించి తన కోరిక తీర్చకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అయితే ఆ బెదిరింపులకు భయపడకుండా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి ఆట కట్టించారు.

మెదక్ జిల్లాకు చెందిన వంజరి సురేష్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. కుత్బుల్లాపూర్ లో నివాసముంటూ కొంపల్లిలోని ఓ కంపనీలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు అదే కంపనీలో పనిచేసే ఓ మహిళా అధికారినిపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని భావించి ఓ పథకం రచించాడు. ఇందులో భాగంగా సోషల్ మీడియా నుండి ఆమె ఫోటోలను సేకరించి, వాటిని అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు. వాటిని ఆ మహిళా అధికారికి వాట్సాప్ ద్వారా పంపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనను ఒంటరిగా కలవాలంటూ డిమాండ్ చేశాడు. లేదంటే ఈ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని  బెదిరించాడు. 

అయితే ఈ బెదిరింపులకు భయపడకుండా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు సురేష్ ను పట్టుకున్నారు. అతడి వద్దగల స్మార్ట్ పోన్ ను స్వాతీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios