ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడిని హత్య చేసి.. మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో దాచిన దారుణమైన ఘటన నల్గొండలో వెలుగు చూసింది.
నల్గొండ : తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అంజనపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. యర్రగొర్ల నగేష్ అనే వ్యక్తి.. అంజనపల్లికి చెందిన వ్యక్తి. ఈ నెల 6న అతని అన్న సతీష్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్టైంట్ చేశాడు.
దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నగేష్ సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దీంట్లో అదే గ్రామానికి చెందిన కంచుగంట్ల శ్రీనివాస్ పలుమార్లు మాట్లాడినట్లు తేలింది. అతడిని విచారించగా.. అక్రమ సంబంధం నేపథ్యంలో నగేష్ ను కత్తితో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని తన ఇంట్లోనే ఉన్న సెప్టిక్ ట్యాంకులో వేశారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో శ్రీనివాస్ అంగీకరించాడు. శుక్రవారం హాలియా సీఐ గాంధీనాయక్ నేతృత్యంలో సెప్టిక్ ట్యాంకులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత..
ఇదిలా ఉండగా, మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఘాతకానికి పాల్పడింది. తన భర్తను స్వయంగా హత్య చేసింది. ఆ తర్వాత భర్త మృతదేహంతో ఇంట్లోనే ఐదు రోజులపాటు జీవించింది. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు ఉలిదిప్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భర్త హత్య విషయం వెలుగుచూసింది. ఈ ఘటన ఝార్ఖండ్లోని జంషేడ్ పూర్ లో జరిగింది. మృతుడిని సుభాష్ కాలనీకి చెందిన అమర్నాథ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి.
అమర్నాథ్ సింగ్ భార్య మీరా. ఆమెకు మానసిక స్థితి సరిగా ఉండదు. . ఈ కారణం తోనే వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. గొడవల నేపథ్యంలో కోపంతో మీరా ఇంట్లోని వస్తువులను బయటకు విసిరేస్తూ నానాహంగా సృష్టించేది. తరచుగా ఇలాంటి ఘటనలు అలవాటైపోయిన స్థానికులు.. అమర్నాథ్ ఐదు రోజులుగా కనిపించకపోవడం.. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించారు.
వారు మీరాను ప్రశ్నించగా.. వారిని ఆమె తిడుతూ, అక్కడినుంచి వెళ్లగొట్టింది. అంతేకాదు వారు తమ ఇంట్లోకి రాకుండా ఉండాలని మీరా ఇంటి చుట్టూ ఉన్న కంచెకు కరెంటు పెట్టింది. దీంతో స్థానికులెవ్వరూ ఇంట్లోకి వెళ్లలేకపోయారు. చివరికి ట్రాన్స్ ఫార్మర్ దగ్గర కరెంటును ఆపేసి.. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. అమర్ నాథ్ మృతదేహం కనిపించింది. అమర్నాథ్, మీరాలకు ఓ కుమారుడు ఉన్నాడు. అతను పూణెలో ఉంటున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం, అమర్ నాథ్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగువారు ఈ విషయాన్ని అతడికి ఫోన్ చేసి తెలిపారు.
తరువాత, తల్లి చేసిన విషయాన్ని అతడికి మొత్తం తెలియజేశారు. దీంతో అతను అక్కడినుంచే స్థానిక పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అమర్ నాథ్ ను చంపిన తరువాత మీరా ఇంటకి తాళం వేసిందని కూడా స్థానికులు తెలిపారు. అమర్నాథ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మీరాను అదుపులోకి తీసుకున్నారు.
