Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పెళ్లి పెట్టిన చిచ్చు: హుజూరాబాద్ లో యువకుడి ఇంటికి నిప్పు


హుజూరాబాద్ లో  ప్రేమ పెళ్లి చేసుకొని దంపతులు పారిపోయారు. యువకుడి ఇంటికి యువతి కుటుంబ సభ్యులు  నిప్పు పెట్టారు.  

love couple Elopes  after marriage , Set fire to grooms residence in huzurabad
Author
First Published Jan 3, 2023, 5:04 PM IST


హుజూరాబాద్:  ప్రేమించుకొని పెళ్లి చేసుకొlన్నారు ఓ జంట.ఈ విషయం తెలుసుకున్న  యువతి కుటుంబ సభ్యులు  యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో యువకుడి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. యువకుడి ఇంట్లోని ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు దగ్దమయ్యాయి.

హుజూరాబాద్ ఇందిరా నగర్ లో ఈ ఘటన  మంగళవారంనాడు చోటు చేసుకుంది. తమకు రక్షణ కల్పించాలని నవదంపతులు  పోలీసులను ఆశ్రయించారు.హుజూరాబాద్ కు చెందిన  రాజశేఖర్,  సంజనలు  వేములవాడలో  పెళ్లి చేసుకున్నారు.పెళ్లి చేసుకున్న తర్వాత రక్షణ కోసం హుజూరాబాద్ పోలీసులను  ఆశ్రయించారు.  తమ కూతురిని వివాహం చేసుకున్నాడని  రాజశేఖర్ ఇంటిని  సంజన కుటుం బ సభ్యులు ఇవాళ పెట్రోల్ పోసి నిప్పంటించారు. 

వరుడు రాజశేఖర్  నివాసానికి నిప్పటించిన  విషయాన్ని గుుర్తించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైరింజన్లు వచ్చేసరికే ఇంట్లోని ఫర్నీచర్ పూర్తిగా దగ్దమైంది. రాజశేఖర్, సంజనలు వివాహనం చేసుకున్న విషయాన్ని  రెండు కుటుంబాలకు చెందిన  పేరేంట్స్ ను పిలిచి  పోలీసులు కౌన్సిలింగ్  ఇచ్చారు.

రాజశేఖర్, సంజనలు ఇద్దరూ  హూజురాబాద్  లోని ఇందిరానగర్ లో  పక్క పక్కనే నివాసం ఉంటారు. వీరిద్దరూ  కొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు.ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది.  కానీ వీరిద్దరి  పెళ్లికి   పెద్దలు ఒప్పుకోలేదు.  
 దీంతో  రాజశేఖర్, సంజనలు వేములవాడ దేవాలయంలో  సోమవారంనాడు వివాహం చేసుకున్నారు.   ఈ విషయం తెులుసుకున్న సంజన కుటుంబ సభ్యులు  రాజశేఖర్ ఇంటికి నిప్పు పెట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios