పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ
టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బుధవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపుగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండా మురళి, యాధవరెడ్డి, రాములు నాయక్, భూపతి రెడ్డిలు పార్టీ మారారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం నాడు మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారుఈ ఈ నోటీసులపై ఎమ్మెల్సీలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.