పీసీసీ చీఫ్ మార్పుపై చర్చే లేదు: కుంతియా
పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా కుండబద్దలు కొట్టారు.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ ఇంచార్జీ కుంతియా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ నెల రెండో వారంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కుంతియా తెలిపారు.నీటి పారుదల, విద్యుత్ శాఖల్లో తెలంగాణ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
ఈ విషయంలో తమ పార్టీ ఉద్యమం నిర్వహించనుందన్నారు. కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. కేసీఆర్ సర్కార్ కుంభకోణాలను బయటపెట్టేందుకు పార్టీ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకొందన్నారు. ఈ అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని కుంతియా డిమాండ్ చేశారు.