Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. భైరి నరేష్‌పై కేసు నమోదు, అలాంటోళ్లను సభలకు పిలవొద్దు : జిల్లా ఎస్పీ

హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే శాంతికి విఘాతం కలిగించే వాళ్లను సమావేశాలకు పిలవొద్దని జిల్లా ఎస్పీ సూచించారు. 

kodangal police filed case on bairi naresh over his remarks on hindu gods
Author
First Published Dec 30, 2022, 4:24 PM IST

అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొడంగల్ పోలీసులు . ప్రస్తుతం పరారీలో వున్న నరేష్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. శాంతికి విఘాతం కలిగించే వాళ్లను సమావేశాలకు పిలవొద్దని ఎస్పీ సూచించారు. 

ALso REad: హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. భైరి నరేష్‌ను పరిగెత్తించి కొట్టిన అయ్యప్ప స్వాములు

ఇదిలావుండగా..శుక్రవారం కర్నూలు జిల్లా కోస్గీలో భైరి నరేశ్‌పై దాడి చేశారు అయ్యప్ప స్వాములు. రెండు రోజుల క్రితం అయ్యప్ప భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్పమాల ధారులు ఆందోళన నిర్వహించారు. కోస్గీలో నరేశ్ కనిపించడంతో ఆగ్రహానికి గురయ్యారు భక్తులు. వెంటనే అతనిపై దాడికి దిగారు. నడిరోడ్డుపై వెంబడించి కొట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios