తెలుగు రాష్ట్రాల గవర్నర్ను కలిసిన కేతిరెడ్డి...
2018 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2019 కి ఘనంగా స్వాగతం పలుకుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇలా మంగళ వారం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంకాక్షలు తెలిపారు. దీంతో రాజ్ భవన్ వద్ద సందడి నెలకొంది.
2018 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2019 కి ఘనంగా స్వాగతం పలుకుతూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఇలా మంగళ వారం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంకాక్షలు తెలిపారు. దీంతో రాజ్ భవన్ వద్ద సందడి నెలకొంది.
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు,తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, చిత్ర నిర్మాత. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులను కలిశారు. వారికి నూతన సంంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్ కు కేతిరెడ్డి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు.