Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం: లబ్దిదారులకు పట్టాలిచ్చిన కేసీఆర్

:సిరిసిల్ల నియోజకవర్గంలోని  తంగళ్లపల్లి మండలం మెరపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు పాల్గొన్నారు. 

KCR inauguates double bedroom houses in siricilla lns
Author
Karimnagar, First Published Jul 4, 2021, 12:36 PM IST

సిరిసిల్ల:సిరిసిల్ల నియోజకవర్గంలోని  తంగళ్లపల్లి మండలం మెరపల్లి గ్రామంలో డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు పాల్గొన్నారు. 35 ఎకరాల్లో రూ. 83 కోట్ల వ్యయంతో  ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. 1320 మంది లబ్దిదారులకు సీఎం పట్టాలను అందించారు. గేటేడ్ కమ్యూనిటీ తరహలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు.  లబ్దిదారులతో నూతన గృహ ప్రవేశం చేయించారు సీఎం కేసీఆర్.ఈ నియోజకవర్గంలోని నూతన కలెక్టరేట్ భవనాన్ని కూడ సీఎం  ప్రారంభించనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios