హైదరాబాద్ : మంజీరా కెమికల్స్లో ఐటీ సోదాలు.. రంగంలోకి 14 బృందాలు
హైదరాబాద్ మంజీరా కెమికల్స్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 14 బృందాలతో ఏకకాలంలో ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మంజీరా కెమికల్స్ సంస్థలో 14 బృందాలతో ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆరు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు, రాజమండ్రిలోని మంజీరా కెమికల్స్ కార్యాలయాల్లో సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్ సురేష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.