తెలంగాణ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, అక్రమాలు జరక్కుండా అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.  

తెలంగాణ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియోజకవర్గంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు, అక్రమాలు జరక్కుండా అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ క్రమంలో ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమీప బందువుకు చెందిన ఫామ్ హౌస్ లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. కొడంగల్ సమీపంలో జగన్నాథరెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ పై తెల్లవారుజామున 4 గంటలకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసుల సాయంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టగా భారీగా దాచిన డబ్బుతో పాటు కొన్ని రశీదులు లభించినట్లు సమాచారం. అయితే ఈ డబ్బులు ఎవరికి...వీటికి సంబంధించి లెక్కలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

ఫామ్ హౌస్ లో నగదు బయటపడ్డ మాట వాస్తవమేనని ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు.కానీ ఆ డబ్బు ఎవరిది...వాటికి సంబంధించి ఏమైనా లెక్కలున్నాయా ... అన్న విషయాలపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని రజత్ కుమార్ తెలిపారు. ఈ ఘటన కొడంగల్ తీవ్ర కలకలం రేపుతోంది.