Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ లో పూజిత మృతి కేసు: డాక్టర్ అలీ అరెస్ట్

శంషాబాద్ లోని అపార్ట్ మెంట్ లో  ఆత్మహత్య చేసుకున్న  పూజిత అనే  సివిల్స్ కు ప్రిపేరౌతున్న విద్యార్ధిని మృతి కేసులో డాక్టర్ అలీని పోలీసులు అరెస్ట్  చేశారు. 

Hyderabad police Arrested doctor  Mohammed Ali for Pujitha death case
Author
First Published Dec 30, 2022, 12:35 PM IST

హైదరాబాద్: సివిల్స్ ప్రిపేర్ అవుతున్న పూజిత ఆత్మహత్య కేసులో   నిమ్స్ లో  పనిచేస్తున్న డాక్టర్ మహమూద్ అలీని  హైద్రాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్  చేశారు.ఉమ్మడి రంగారెడ్డి  జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన  పూజిత  సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంది.  శంషాబాద్ లోని  ఓ అపార్ట్ మెంట్ లో  రూమ్ లో అద్దెకు ఉంటూ ఆమె సివిల్స్  కు ప్రిపేర్ అవుతుంది.   రెండు  రోజుల క్రితం  తాను  ఉంటున్న రూమ్ లోనే  పూజిత  అనుమానాస్పదస్థితిలో ఆమె ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై  పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

ఈ దర్యాప్తులో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు.  గత నాలుగేళ్ల క్రితం  తన  తల్లికి  అనారోగ్య కారణాలతో  నిమ్స్ ఆసుపత్రికి ఆమె  వెళ్లిన సమయంలో   అక్కడ పనిచేసే డాక్టర్  మహమూద్ అలీతో పరిచయం ఏర్పడింది.  ఈ సమయంలో  అలీతో  ఏర్పడిన పరిచయం  ప్రేమకు దారితీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.  అప్పటికే  అలీకి పెళ్లైంది.  ఈ విషయాన్ని అలీ దాచి పెట్టాడని  ఆమె తర్వాత తెలుసుకుంది.  తనను పెళ్లి చేసుకోవాలని అలీని కోరితే  అతను ముఖం దాచేసినట్టుగా  పోలీసులు  గుర్తించారు. దీంతో ఆమె తాను నివాసం ఉంటున్న  గదిలో  కిటీికీ  ఉరేసుకొని మృతి చెందింది. ఈ కేసుకు సంబంధించి అలీని ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు.

పూజిత నివాసం ఉంటున్న  విల్లా నుండి దుర్వాసన రావడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు ఈ విల్లా తలుపులు బద్దలు కొట్టి చూస్తే  పూజిత  మృతదేహం గుర్తించారు. పూజిత  ఉరేసుకొన్నట్టుగా  కన్పించింది.  పూజిత డెడ్ బాడీకి  కుటుంబ సభ్యులు  అంత్యక్రియలు పూర్తి చేశారు. పూజిత మృతిపై కుటుంబసభ్యులు  ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios