Asianet News TeluguAsianet News Telugu

పెళ్లైన రెండు నెల్లకే.. భార్యను దారుణంగా చంపి.. మిస్సింగ్ కేసు పెట్టిన భర్త...

ఖమ్మ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్యను పాశవికంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య హత్య చేసి ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇప్పుడు భర్తే నిందితుడని బైటపడడంతో అందరూ షాక్ అవుతున్నారు. 

Husband brutally killed wife in khammam district - bsb
Author
Hyderabad, First Published Feb 5, 2021, 11:57 AM IST

ఖమ్మ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్యను పాశవికంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య హత్య చేసి ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కేసు పెట్టాడు. ఇప్పుడు భర్తే నిందితుడని బైటపడడంతో అందరూ షాక్ అవుతున్నారు. 

వివరాల్లోకి వెడితే.. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలు ఎర్రమల్ల నవ్య రెడ్డి (22)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఏర్రాపాలెం పోలీస్ స్టేషన్లో నవ్యారెడ్డి  కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసు పెట్టింది నవ్వ్యా రెడ్డి భర్త నాగశేషురెడ్డినే కావడం విచిత్రం. 

భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్యరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అనుమానంతో భర్తను విచారించగా అసలు విషయం బైట పడింది. ఇప్పుడు భర్త నాగశేషురెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. 

భర్త నాగశేషురెడ్డి, నవ్యరెడ్డిని బైక్ పై తీసుకువెళ్తున్న సీసీటివి ఫుటేజ్‌ని పోలీసులు సేకరించారు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వీరి పెళ్లై రెండు నెలలే అయ్యింది. 

వీరిది మధిర మండలం ఏర్రుపాలెం గ్రామం. నవ్యరెడ్డి సత్తుపల్లి లో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది. నాగశేషురెడ్డి బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లైన రెండు నెళ్లకే ఎందుక చంపాల్సి వచ్చింది, దీని వెనుక అసలు కారణం ఏంటీ అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios