Asianet News TeluguAsianet News Telugu

భవనంపై మనిషి పుర్రె, ఎముకలు: టెర్రాస్ గేటుకు లాక్

హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ షాకింగ్ విషయం బయటపడింది. బహుళ అంతస్థుల భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Human skull, bones found on building roof in Hyderabad
Author
A. S. Rao Nagar, First Published Dec 30, 2020, 8:21 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ భవనంపై దిగ్భ్రాంతికి గురిచేసే విషయం వెలుగు చూసింది. బహుళ అంతస్థుల కమర్షియల్ భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు కనిపించాయి. ఈ సంఘటన హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ లో చోటు చేసుకుంది. 

కూలీలు చెత్తకుప్పలను ఎత్తిపోస్తుండగా ఎఎస్ రావు నగర్ లోని వోర్టెక్స్ భవనం టెర్రాస్ మీద మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. భవనం నాలుగో అంతస్థులో ఓ జూనియర్ కాలేజీ ఉంది. విద్యార్థులు టెర్రాస్ మీదికి వెళ్లకుండా దానికి తాళం వేశారు. అది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. 

చెత్తను ఎత్తిపోయడానికి, వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరించడానికి కూలీలను మంగళవారం టెర్రాస్ మీదికి పంపించారు. ఆ సమయంలో పుర్రె, ఎముకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు కుషాయిగుడా ఇన్ స్పెక్టర్ ఎ మన్మోహన్ తెలిపారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు 

Follow Us:
Download App:
  • android
  • ios