జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం (వీడియో)
ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిరు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి.
"
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిరు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.