మానవత్వానికి మచ్చి తెచ్చే దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. సమాజం తలదించుకునేలా కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

మానవత్వానికి మచ్చి తెచ్చే దారుణానికి పాల్పడ్డాడో వ్యక్తి. సమాజం తలదించుకునేలా కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పహాడిషరీప్ ప్రాంతంలో నిరంజన్ అనే వ్యక్తి భార్యా, పిల్లలతో కలిసి నివాసముండేవాడు. అయితే తాగుడుకు బానిసైన ఇతడు వావివరసలు మరిచి ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే కన్నేశాడు. బాలిక ను బెదరించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడేవాడు. దీంతో గర్భం దాల్చిన చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఈ అఘాయిత్యంపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బాధిత అమ్మాయికి పుట్టిన బాబు డీఎన్ఏ పరీక్ష ద్వారా నిందితున్ని గుర్తించారు. బాధితురాలి కన్న తండ్రే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి అతడిపై వివిధ సెక్షన్లతో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఎల్బీ నగర్ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించింది.