నేను చెప్పిన స్వతంత్రుల అంశం నిజమే:లగడపాటి
ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు.
హైదరాబాద్: ఎన్నికల సర్వేలతో ఆంధ్రా ఆక్టోపస్గా పేర్గాంచిన తెలంగాణలో స్వతంత్రులు గెలుస్తున్నారంటూ శుక్రవారం తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులకు ఓట్లు వేసేందుకు ప్రజలు మెుగ్గుచూపుతున్నారని తెలిపారు.
అయితే ఈ అంశం సాధారణ విషయం కాదని లోతుగా పరిశీలిస్తే 8 నుంచి 10 మంది గెలుస్తారని తెలిసిందన్నారు. డబ్బు, అధికారం ఏ ప్రలోభాలకు లొంగకుండా పార్టీలు తిరస్కరించినవారిని ఎన్నుకుంటున్నారంటే తెలంగాణ ప్రజలను అభినందించాలన్నారు.
అయితే లగడపాటి సర్వేపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా మీడియా తనను సర్వే గురించి అడిగితే వారి సంతోషం కోసం స్వతంత్రుల అంశం చెప్పానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్
తెలంగాణలో స్వతంత్రులే కింగ్మేకర్లు: లగడపాటి సంచలన సర్వే