Asianet News TeluguAsianet News Telugu

ఓవైపు స్వామి వారికి అభిషేకం.. పుష్కరిణిలో ఈవో జలకాలు, వీడియో వైరల్

స్వామి వారి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణి వద్ద ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే ఈవో ఈత కొట్టడం నిజామాబాద్‌లో కలకలం రేపుతోంది. స్థానిక శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది. 

eo swims in neelakantheswara temple pushkarani in  nizamabad ksp
Author
First Published May 26, 2023, 5:41 PM IST

నిజామాబాద్‌ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి దేవాలయంలో అపచారం జరిగింది. స్వామి వారి విగ్రహాలకు ఆలయ అర్చకులు పుష్కరిణి వద్ద ప్రత్యేక అభిషేకం చేస్తుండగా.. ఆ పక్కనే ఈవో ఈత కొట్టారు. వివరాల్లోకి వెళితే.. సదరు ఈవోను వేణుగా గుర్తించారు. ఇతను ఆ పరిసరాల్లోని నాలుగు ఆలయాలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలకు పుష్కరిణి వద్ద అభిషేకం కార్యక్రమం చేపట్టారు అర్చకులు.

అయితే ఈ సమయంలో వేణు పుష్కరిణిలోకి దిగా ఈత కొట్టారు. దీనిపై పూజారులు అభ్యంతరం తెలిపినా వారి మాటను పట్టించుకోలేదు. దీంతో అభిషేకం కార్యక్రమానికి వచ్చిన భక్తుల్లో ఒకరు సెల్‌ఫోన్ ‌లో ఈవో ఈత కొడుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆలయ పవిత్రను రక్షించాల్సిన హోదాలో వుండి, అపచారానికి పాల్పడ్డారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios