కామారెడ్డి జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది.  మద్యం మత్తులో  ఏడేళ్ల కూతురును ఓ తండ్రి  మంటల్లో వేశాడు.

కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలం బరంగేడ్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఏడేళ్ల కూతురును మంటల్లో వేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన పక్కింటి వ్యక్తి ఆ బాలికను కాపాడాడు. ఆ బాలికకు స్వల్ప గాయాలతో బయట పడింది. 

మద్యం మత్తులో ఆ వ్యక్తి కూతురును మంటల్లో వేశాడు. అయితే మంటల్లో బాలిక పడిన విషయాన్ని సకాలంలో గుర్తించకపోతే ప్రమాదం జరిగేది. అయితే బాలికను కాపాడిన వ్యక్తికి కూడ స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.